శ్రీవారి సేవలో ఇస్రో శాస్త్రవేత్తలు


తిరుమల: పీఎస్‌ఎల్‌వీ- సీ38 వాహక నౌకను అంతరిక్షంలోకి పంపనున్న నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తలు గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇస్రో చెందిన శాస్త్రవేత్తలకు టీటీడీ అదికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. శుక్రవారం నింగిలోకి పంపనున్న పీఎస్‌ఎల్‌వీ - సీ 38 వాహకనౌక నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top