ధర్మాన దృష్టికి ఇసుక దందా...


శ్రీకాకుళం : పట్టణంలోని ఏర్పాటైన హయాతినగరం ఇసుక రీచ్‌లో చోటుచేసుకుంటున్న అక్రమాలపై అధికారులు దృష్టి సారించకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నదీ గర్భాల్ని తోడేయడంతో పాటు ప్రభుత్వానికి జమ కావాల్సిన మొత్తాలు టీడీపీ నేతలు జేబులో వేసుకుంటున్న వైనాన్ని గతంలో తెలుగుదేశం పార్టీ నాయకుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందించకపోవడంతో ఆందోళన చేపట్టేందుకు సన్నద్ధమయ్యారు. మహిళా సంఘాల పేరిట నాయకులు దందా నడిపించడంపై స్థానికులు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు దృష్టికి మంగళవారం తీసుకువెళ్లారు. గతంలో పలుమార్లు అక్కడ రీచ్ వ్యవహారాన్ని అందరి దృష్టికి తీసుకువెళ్లామని అయినా దందా ఆగడంలేదని వారు స్పష్టం చేశారు. దీంతో ధర్మాన ఆధ్వర్యంలో కాంగ్రెస్ సహా ఇతర పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఇసుక రీచ్‌ను బుధవారం పరిశీలించనున్నారు. అక్కడి వ్యవహారాన్ని ప్రజలు, అధికారుల దృష్టికి తీసుకువెళ్లనున్నామని ధర్మాన సాక్షికి తెలిపారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top