నకిలీ పాసు పుస్తకాల తయారీపై విచారణ ముమ్మరం


అనంతపురం: అనంతపురం జిల్లాలో నకిలీ పాసు పుస్తకాల తయారీ ముఠా అరెస్టుతో రెవెన్యూ శాఖ విచారణ ముమ్మరం చేసింది. జిల్లా పరిధిలోని ధర్మవరం, కంబదూరులో ఉన్న ఆంధ్రా బ్యాంకు, కెనారా బ్యాంకులో రెవెన్యూ అధికారులు , పోలీసు బృందాలు రికార్డులను పరిశీలించాయి.



జిల్లా సంయుక్త కలెక్టర్ లక్ష్మీకాంతం పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విచారణను ముమ్మరం చేసినట్లు ఉన్నాతాధికారులు  తెలిపారు. మండలాల వారీగా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నకిలీ పాసు పుస్తకాలు గుర్తిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే కంబదూరు మండల కేంద్రంలోని వివిధ బ్యాంకుల్లో 500 నకిలీ పాస్ పుస్తకాలను రెవెన్యూ.. బ్యాంకు అధికారులు గుర్తించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top