ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు
నేటి నుంచి మెటీరియల్స్ పంపిణీ
జూన్ 3 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో ఈనెల 25 నుంచి జరగనున్న ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరం చేశామని ఇంటర్మీడియెట్ విద్యామండలి ప్రాంతీయ జిల్లా పర్యవేక్షణాధికారి ఎ.అన్నమ్మ మంగళవారం తెలిపారు. ఇందులో భాగంగా తొలుత పరీక్షలకు సంబంధించిన మెటీరియల్స్ను బుధవారం నుంచి పంపిణీ చేస్తామన్నారు. ఆర్ఐవో కార్యాలయానికి వచ్చి వెంటనే తీసుకెళ్లాలన్నా ప్రిన్సిపాళ్లకు సూచించారు. మెటీరియల్స్లో లోటుపాట్లు ఉంటే వెంటనే తిరిగి అప్పగించాలన్నారు.
జూన్ 3 నుంచి ప్రాక్టికల్స్
ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ప్రాక్టికల్ పరీక్షలు జూన్ 3 నుంచి 7వ తేదీ వరకు శ్రీకాకుళం ప్రభుత్వ బాలుర జూని యర్ కళాశాలలో జరుగుతాయని అన్నమ్మ చెప్పారు. నైతికత, మానవతా విలువల పరీక్ష జూన్ 8, పర్యావరణ విద్య పరీక్ష జూన్ 9న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు జరుగుతాయన్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచి ఎప్లియేషన్ రెన్యువల్స్ కొరకు చలానా కట్టిన కళాశాలల యాజమాన్యాలు ఆన్లైన్లో దరఖాస్తు చేసి, సంబంధిత పత్రాలను జతపరచి ఆర్ఐవో కార్యాలయంలో రెండు కాపీలను అందజేయాలని సూచించారు. వివరాలకు 08942-2278151నంబర్ను సంప్రదించాలన్నారు.