ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
నెల్లూరు : శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట రాజగోపాలపురానికి చెందిన పి. ఇందుమతి (17) ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల్లో తప్పాననే ఆవేదనతో ఆదివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బంగారుపని చేసే పి. చంద్రశేఖర్ కుమార్తె ఇందుమతి మూడు రోజుల కిందట విడుదలైన ఇంటర్ పరీక్ష ఫలితాల్లో ఓ సబ్జెక్టులో తప్పింది. దీంతో తీవ్ర ఆవేదన చెందిన ఇందుమతి.. ఇంట్లో ఎవరూ లేనిసమయంలో ఉరి వేసుకుంది. కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి చూసే సరికి ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది. ఎస్ ఆంజనేయరెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.