ముహూర్తం వేళకు వధువు అదృశ్యం
శాంతిపురం: చివరి నిమిషంలో వధువు అదృశ్యం కావటంతో మరో అమ్మయితో పెళ్లి తంతు పూర్తి చేశారు. ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకొంది. 64 పెద్దూరు పంచాయుతీ సోమాపురానికి చెందిన యుువతికి కర్ణాటక రాష్ట్రంలోని కోలారు జిల్లా హనువుంతపురం అబ్బాయితో పెళ్లి నిశ్చయుమైంది. శుక్రవారం వరుడి స్వగృహం వద్ద పెళ్లి జరగాల్సి ఉంది.
అయితే వధువు గురువారం తెల్లవారుజామున ఇంటి నుంచి అదృశ్యమైంది. దీంతో అప్పటికప్పుడు మరో అమ్మయిని వెతికి వరుడికి నిశ్చయించిన ముహుర్తానికే పెళ్లి జరిపించారు. సోమాపురానికి చెందిన వధువు తండ్రి తన కుమార్తెకు అదే గ్రామానికి చెందిన ఓ యుువకుడు మాయుమాటలు చెప్పి తీసుకుపోయడని రాళ్లబూదగూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, బంధువులు వెతికినా యుువతి, యువకుడి ఆచూకీ లభించలేదు.