'తక్షణం చర్యలు తీసుకోవాలి'
గుంటూరు (అమర్తలూరు): ప్రభుత్వ అధికారితో అమర్యాదగా ప్రవర్తించడంతో పాటు దాడికి యత్నించిన వ్యక్తులపై తక్షణం చర్యలు తీసుకోవాలని రెవెన్యూ సిబ్బంది సబ్కలెక్టర్ కార్యలయం ఎదుట ధర్నాకు దిగారు. గుంటూరు జిల్లా అమర్తలూరు మండల ఇన్చార్జ్ తహశీల్దార్పై గురువారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు దాడికి దిగారు.
ఈ చర్యను నిరసిస్తూ శుక్రవారం ఉదయం జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెవెన్యూ ఉద్యోగులు గుంటూరు సబ్కలెక్టర్ కార్యలయం ఎదుట బైఠాయించారు. ప్రభుత్వ ఉద్యోగిపై దాడికి పాల్పడిన వ్యక్తులపై తక్షణం చర్యలు తీసుకోవాలని సబ్కలెక్టర్కు వినతిపత్రం అందిచ్చారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు పీసీహెచ్.వెంకయ్యతో పాటు జిల్లా రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు.