'నరసరావు పేట నుంచి పోటీ చేయను అంతే'
నేటితో నామినేషన్ల ప్రక్రియ తెరపడనుంది. అంతలో గుంటూరు జిల్లా కాంగ్రెస్కు పెద్ద ఝలక్ తగిలింది. నరసరావు పేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు సయ్యద్ జిలానీ నిరాకరించారు. దాంతో కాంగ్రెస్ పార్టీ నేతలు రంగంలోకి దిగి ఆయన్ని ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు నరసరావు పేట ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి కుమారుడు కాసు మహేశ్ను కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసేంది.
అయితే ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆయన విముఖత వ్యక్తం చేశారు. దాంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల వేట మొదలు పెట్టింది. అందులోభాగంగా సయ్యద్ జిలానీని ఎంపిక చేసింది. దాంతో సయ్యద్ జిలానీ సంతోషం ఎగరి గంతేశాడు. అంతలో ఏమైందో ఏమో తాను పోటీ చేయను అంతే అంటూ జిలానీ భీష్మించుకుని కూర్చున్నాడు. దాంతో నరసరావు పేటలో స్థానిక కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకుని కూర్చున్నారు.