అవసరమైతే బీజేపీని నిలదీస్తాం
తిరుపతి సిటీ: కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీతో తెలుగుదేశం పార్టీ విభేదిస్తే వాళ్ళు (వైఎస్సార్సీపీ)దూరాలని చూస్తున్నారని ఢిల్లీలోని రాష్ట్ర ప్రభు త్వ వ్యవహారాల ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్రావు ఆరోపించా రు. మహానాడులోని మీడియా పాయింట్ వద్ద శుక్రవారం ఎంపీలు గల్లా జయదేవ్, కింజారపు రామ్మోహన్నాయుడుతో కలసి రామ్మోహన్రావు మాట్లాడారు. ప్రత్యేక హోదాకోసం వెనక్కుతగ్గేది లేదని, బీజేపీతో తమకున్న సంబంధాలను చెడగొట్టడానికి చూస్తున్నారని తెలిపారు. అంతమాత్రాన రెచ్చిపోమని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే బీజేపీని నిలదీస్తామని తెలిపారు. రాష్ట్రాభివృద్ధి, ప్రజల ప్ర యోజనాలు ముఖ్యమని చెప్పారు. ప్రత్యేకహోదా కావాలని తీర్మానించామన్నారు. దీని ద్వారా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు. ఇప్పటి వరకు కేంద్రప్రభుత్వం 700 కోట్లే రాష్ట్రానికి నిధులు ఇచ్చిందని చెప్పారు.
తమ పార్టీ చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను గ్రామస్థాయి నుంచి ప్రజల్లోకి తీసుకెళ్లనున్నామని చెప్పారు. సమావేశంలో టీడీపీ అధికార ప్రతినిధి ముళ్ళపుడి రేణుక, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డెరైక్టర్ బడిసుధాయాదవ్, టీడీపీ జాతీయ మీడియా కన్వీనర్ ఎల్వి ఎస్ఆర్కె ప్రసాద్, మహానాడు మీడియా కో- కన్వీనర్ లౌలీ వెంకటేశ్వర రావు, ఎమ్మార్పల్లి రామచంద్రారెడ్డిలు పాల్గొన్నారు. అంతకు ముందు మీడియా పాయింట్లో బీసీ సంక్షేమశాఖామంత్రి కొల్లు రవీంద్ర, ఎంఎల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు తదితరులు మాట్లాడారు.