‘నా తల పగిలినా కొండను ఢీకొట్టేందుకు సిద్ధం’

నా వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నా: కేశినేని నాని - Sakshi


విజయవాడ: బీజేపీతో పొత్తువల్లే మెజార్టీ తగ్గిందన్న తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని టీడీపీ ఎంపీ కేశినేని నాని మరోసారి స్పష‍్టం చేశారు.  పొత్తు లేకుంటే టీడీపీకి మరింత మెజార్టీ వచ్చేదని ఆయన బుధవారమిక్కడ అన్నారు. తనకు ముఖ్యమంత్రే అధిష్టానం అని... ఒకవేళ ఈ అంశంపై అడిగితే వివరణ ఇస్తానని కేశినేని తెలిపారు.


తాను మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదని, వాస్తవలే మాట్లాడానని ఆయన సమర్థించుకున్నారు. తల పగిలినా కొండను ఢీకొట్టేందుకు సిద్ధమని... తన కాన్ఫిడెన్స్‌ అలాంటిదని అన్నారు. కార్యకర్తల్లో ప్రేరణకోసమే అలా మాట్లాడానని, తాను పార్టీ సమావేశంలోనే మాట్లాడానని, బహిరంగ సభలో కాదని కేశినేని నాని పేర్కొన్నారు. ఇక పొత్తులు, నామినేటెడ్‌ పోస్టుల భర్తీ విషయాన్ని అధిష్టానం చూసుకుంటుందని ఆయన తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top