'సెక్షన్ 8 విధించడానికి నేను వ్యతిరేకం'

'సెక్షన్ 8 విధించడానికి నేను వ్యతిరేకం' - Sakshi


హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నగరంలో సెక్షన్ 8 విధించడానికి తాను వ్యతిరేకమని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. సెక్షన్ 8 పేరుతో మరోసారి కేంద్రానికి అధికారం కట్టబెట్టేస్తారా అని ఆయన ప్రశ్నించారు. ఆయన ఈ అంశాలపై ఏమన్నారంటే..

 


* ప్రజల మధ్య అంతర్యుద్ధాలు జరిగితే అప్పుడు సెక్షన్ 8 పెట్టాల్సిన అవసరం వస్తుంది తప్ప చంద్రబాబు మీద కేసు పెడితే సెక్షన్ 8 అవసరం లేదు

* హైదరాబాద్లో సెక్షన్ 8 విధించడానికి నేను వ్యతిరేకం

* విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరిగింది

* ఎటూ ఒక రాష్ట్రానికి అన్యాయం జరిగింది, ఇప్పుడు హైదరాబాద్లో సెక్షన్ 8 పేరుతో కేంద్రానికి అప్పగిస్తే మళ్లీ అన్యాయం జరుగుతుంది

* ఉద్యమాల్లో ఉన్నప్పుడు కేసీఆర్ ఏమైనా చెల్లుతుంది. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన సీఎం.. తర్వాత పక్షపాతం వహిస్తున్నారని అనిపిస్తే మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది



* ఎన్డీయే, యూపీఏలు ఒక కమిటీ వేసి, ఇక్కడి వ్యవహారాలు పరిశీలించేలా చూడండి

* చంద్రబాబు చెప్పిన లాంటి సమస్యల పరిష్కారానికి ఈ కమిటీ మార్గాలు సూచించాలి

* మీడియా స్వేచ్ఛను హరించకండి. అలా హరించినంత మాత్రాన వాస్తవాలు బయటకు రాకుండా ఉండవు

* ఎమర్జెన్సీ సమయంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛమీద నియంత్రణ విధించినప్పుడు రాంనాథ్ గోయెంకా సంపాదకీయం స్థానంలో తెల్ల కాగితం వదిలేసి ప్రచురించారు



* రెండు రాష్ట్రాల్లోనూ కొన్ని చానళ్లను అనధికారికంగా ఆపినట్లు తెలిసింది. అలా చేయకండి

* హైదరాబాద్ తెలంగాణ రాజధాని.. అందులో తిరుగులేదు. అయితే, ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం పూర్తయ్యేవరకు ఇది ఉమ్మడి రాజధాని. ఇక్కడ ఏపీ ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాలు చేయకండి.

* ఎంతసేపూ హైదరాబాద్ లాంటి నగరాన్ని తయారుచేయాలని ఏపీ పాలకులు చూడొద్దు. భవనాలు కట్టొచ్చు గానీ ప్రజలను తీసుకెళ్లలేరు



* విభజన సమస్యలు తీర్చాల్సిన వాళ్లు కొట్టుకుంటూ కూర్చుంటే ఇబ్బంది

* అందరి కళ్లలో దూలాలున్నాయి.. సైజులే తేడా

* దీన్ని పరిష్కరించకపోతే అంతర్యుద్ధాలు జరుగుతాయి

* రాజధాని ఇచ్చి తెలంగాణను సంతోషపెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇస్తామని యూపీఏ, ఎన్డీయే రెండ చెప్పాయి



* తిడితే కేసీఆర్లా తిట్టాలి.. పడితే పౌరుషం లేని ఆంధ్రప్రదేశ్ ఎంపీల్లా పడాలి

* వాళ్లకు పౌరుషం, ఆత్మగౌరవం లేవా అని అనిపిస్తోంది

* ఉత్తరాది ఎంపీలతో కొట్టించుకుని పార్లమెంటు నుంచి బయటకు వచ్చారు



* కేశినేని నాని తనకు ఎంపీ సీటు కావాలని బలంగా ఊగిపోయారు. ఇప్పుడేం చేస్తున్నారు? పార్లమెంటు గోడలు చూస్తూ ఆశ్చర్యపోతున్నారా.. ప్రత్యేక హోదా కోసం ఏమైనా చేస్తున్నారా?

* బీజేపీ తరఫున ఇద్దరు ఎంపీలున్నారు.. మీరు ఏం చేస్తున్నారు

* హైకమాండ్ మీద నమ్మకం ఉందంటూ కాలం గడిపేస్తున్నట్లు కనిపిస్తోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top