భార్యను గొంతు కోసి చంపిన భర్త


దర్శి (ప్రకాశం జిల్లా) : దర్శి మండలం వెంకటాచలంపల్లి గ్రామంలో సోమవారం భార్యను గొంతు కోసి హత్య చేశాడు ఓ  ప్రబుద్ధుడు. భార్యపై అనుమానం పెంచుకుని ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో భార్య అంకాల నర్సమ్మ(30) అక్కడికక్కడే మృతిచెందింది. నిందితుడు అంకాల నాగేశ్వరరావు పరారీలో ఉన్నాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top