ఆమరణ నిరాహార దీక్ష భగ్నం
సుండుపల్లి(వైఎస్సార్ కడప): ఇసుక క్వారీలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. మూడు రోజులుగా సాగుతున్న ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. క్వారీ రద్దు చేయాలని కోరుతూ.. మాల మహానాడు వైఎస్సార్ కడప జిల్లా అధ్యక్షుడు బండి ఈశ్వర్ అధ్యక్షతన ఎనిమిది మంది ఆమరణ నిరాహారా దీక్ష చేపడుతుండగా.. శుక్రవారం తెల్లవారుజామున సుండుపల్లి పోలీసులు అక్కడకు చేరుకొని వారిని అరెస్ట్ చేశారు. వారి ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు.