క్వారీలపై దాడి: పేలుడు పదార్థాలు స్వాధీనం


విశాఖపట్నం : విశాఖ జిల్లా రౌలుకుంట మండలంలోని నల్లరాతి క్వారీలపై పోలీసులు గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. నిబంధనలకు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహిస్తుందున ఈ దాడులు నిర్వహించారు. పాతంపేట క్వారీకి చెందిన రాజుల నాయుడును అదుపులోకి తీసుకున్నారు. మరో క్వారీకి చెందిన వ్యక్తి పరారయ్యాడు. ఈ రెండు క్వారీల నుంచి 70 జిలెటిన్ స్టిక్స్, 36 డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

(రౌలుకుంట)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top