కూతుర్ని హత్య చేసిన తల్లిదండ్రులు

కూతుర్ని హత్య చేసిన తల్లిదండ్రులు - Sakshi


వీరప్పలి: తమ కూతురు వేరే కులస్తున్ని ప్రేమించిన కారణంగా  తల్లి దండ్రులు ఆ యువతిని హత్య చేసిన ఘటన చిత్తూరు జిల్లాలోని పెద్దపంజాని మండలం వీరప్పలిలో కలకల సృష్టించింది.  కూతురు ప్రేమ వ్యవహారం తల్లి దండ్రులకు తాజాగా తెలియడంతో వారు భరించలేకపోయారు.


 


తమ పరువు పోతుందని భావించిన ఆ తల్లి దండ్రులు సొంత కూతుర్ని అమానుషంగా హత్య చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top