కలెక్టరేట్లో హోమ్గార్డు ఆత్మహత్యాయత్నం
మచిలీపట్నం (కృష్ణా జిల్లా) : వడ్డీవ్యాపారులు వేధిస్తున్నారని, వారి బారి నుండి కాపాడాలని కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చిన హోమ్గార్డు అక్కడే కుప్పకూలిపోవడంతో హుటాహుటిన అతణ్ణి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పురుగుల మందు సేవించినందువల్లే అతను అస్వస్థతకు గురయ్యాడని సిబ్బంది తెలిపారు. ఈ సంఘటన సోమవారం మధ్యాహ్నం కలెక్టరేట్లో జరిగింది.
ఆంజనేయులు జిల్లా ఎస్పీ కార్యాలయంలో హోమ్గార్డుగా పనిచేస్తున్నాడు. ఆయన తండ్రి వడ్డీవ్యాపారుల వద్ద అప్పులు చేసి ఇటీవలే మరణించాడు. వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీ చెల్లించమని వేధిస్తుండడంతో ఆంజనేయులు ప్రజావాణిలో కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చి వస్తూ కార్యాలయంలోనే కుప్పకూలిపోయాడు. అప్పటికే తను పురుగుల మందు తాగి ఉండడంతో గమనించిన అధికారులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడు.