తిరుమలలో కొనసాగుతున్న రద్దీ
తిరుమల: మండుతున్న ఎండలు శ్రీవారి భక్తులపై ప్రభావం చూపలేకపోతున్నాయి. తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు శ్రీవారి దర్శనానికి బారులు తీరారు. సోమవారం 27 కంపార్టుమెంటుల్లో భక్తులు, వేంకటేశ్వర దర్శనానికి వేచి ఉన్నారు.
నడక దారిన వచ్చే వారికి 7 గంటలు, ప్రత్యేక దర్శనానికి వచ్చే వారికి 3 గంటల సమయం పడుతోంది.