సీఐడీ పై హైకోర్టు సీరియస్
హైదరాబాద్: అగ్రిగోల్డ్ కేసులో సీఐడీ దర్యాప్తు పై హైకోర్టు సీరియస్ అయ్యింది. సరైన దిశగా సీఐడీ దర్యాప్తు చేయడం లేదని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆస్తుల విషయంలో కోర్టును తప్పు దోవ పట్టిస్తున్నాని సీఐడీతో పాటూ అగ్రిగోల్డ్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అగ్రిగోల్డ్ ఆస్తులను వేలం వేయడం యాజమాన్యానికి ఇష్టం లేదన్న కోర్టు, ఆస్తుల వేలం కమిటి కొత్త చైర్మన్గా జస్టిస్ సీతాపతిని నియమించింది. తదుపరి విచారణ ఈనెల 12కు వాయిదా వేశారు.
అగ్రిగోల్డ్ సంస్థలో పెట్టుబడులు పెట్టి సుమారు 40 లక్షల మంది నష్టపోయిన సంగతి తెలిసిందే. వీరిలో 32 లక్షల మంది డిపాజిటర్లు కాగా 8 లక్షల మంది ఏజెంట్లు ఉన్నారు. ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలలో కార్యకలాపాలు నిర్వహించి దివాళా తీసింది.