ముకేశ్ అంబానీకి హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ఓ భూ వివాదంలో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీతో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రతినిధులకు హైకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాద్రావు ఉత్తర్వులు జారీ చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రతినిధులు తమ భూమిని ఆక్రమించుకున్నారని, కింది కోర్టులో ఫిర్యాదు చేస్తే పిటిషన్ను విచారణకు స్వీకరించడం లేదంటూ తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన చెక్కా దుర్గాంబ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాకినాడలోని 8.23 ఎకరాల భూమి పై హక్కుల విషయంలో న్యాయస్థానాల్లో తమకే అనుకూలమైన తీర్పు వచ్చిందని పిటిషనర్ తెలిపారు. రిలయన్స్ ప్రతినిధులు తప్పుడు డాక్యుమెంట్లతో ఆ భూమిని స్వాధీ నం చేసుకున్నారని ఆరోపించారు.
దీనిపై ఫిర్యాదు చేస్తే కాకినాడ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు విచారణకు తీసుకునేందుకు నిరాకరిస్తోందన్నా రు. తన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని విచారణకు స్వీకరించేలా కాకినాడ కోర్టును ఆదేశించాలని ఆమె కోర్టును కోరారు. వాదనల అనంతరం ప్రతివాదులుగా ఉన్న ముకేశ్తో పాటు స్థానిక రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రతినిధులకు న్యాయమూర్తి నోటీసులు జారీ చేస్తూ విచారణను జూన్కు వాయిదా వేశారు.
సంబంధిత వార్తలు