ఆస్తుల రిజిస్ట్రేషన్కు హైకోర్టు అనుమతి
అగ్రిగోల్డ్ కేసులో ఆదేశం
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం పర్యవేక్షణ కమిటీ నేతృత్వంలో జరిగిన ఆస్తుల వేలంలో అమ్ముడుపోయిన ఆస్తులను వాటి కొనుగోలుదార్ల పేర్లు మీద రిజిస్టర్ చేసేందుకు హైకోర్టు శుక్రవారం అనుమతినిచ్చింది. అమ్ముడుపోయిన ఆస్తులు అగ్రిగోల్డ్కు చెందిన పలు అనుబంధ కంపెనీల పేర్లపై ఉన్నందున, వాటిని కొనుగోలుదార్లకు రిజిస్ట్రేషన్ చేసే అధికారాలను ఆ అనుబంధ కంపెనీల అధికారులకు ఇవ్వాలని అగ్రి యాజమాన్యానికి స్పష్టం చేసింది.
ఇప్పటి వరకు అమ్ముడుపోయిన ఆస్తులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను అక్టోబర్ 15 నుంచి 31వ తేదీలోపు పూర్తి చేయాలని తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ ఎస్.వి.భట్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.