విజయవాడలో భారీగా ట్రాఫిక్ జాం


విజయవాడ: ప్రకాశం బ్యారేజిపై చేపట్టిన మరమ్మతుల కారణంగా వాహనదారులకు ఇక్కట్లు మొదలయ్యాయి. పాదచారులను కూడా బ్యారేజిపైకి అనుమతించడం లేదు. మంగళవారం ఉదయం నుంచి వాహనాలను వారధి-తాడేపల్లి మార్గంలోకి మళ్లించటంతో జనానికి చుక్కలు కనబడుతున్నాయి. బురద, గుంతలమయంగా ఆ రహదారిలో వాహనాలు వేగంగా ముందుకు కదిలే వీలులేకుండాపోయింది. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్ స్తంభించిపోయింది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top