క్యూలైన్లలో స్పృహ తప్పిన భక్తులు
విజయవాడ: విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయంలో ఎండవేడిమికి పలువురు భక్తులు స్పృహ తప్పి పడిపోయారు. క్యూలైన్లపై నీడ కోసం టెంట్లు వేయకపోవడం, మధ్యాహ్నం నివేదన సమయంలో దర్శనాలను గంటపాటు నిలిపివేయడమే ఈ పరిస్థితికి కారణం. సింగ్నగర్కు చెందిన భక్తురాలితో పాటు మరొకరు స్పృహ తప్పి పడిపోయారు. కాగా, సరైన ఏర్పాట్లు చేయకపోవడంపై భక్తులు దేవస్థానం సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, శ్రావణ శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ అధికంగా ఉంది. దీంతో అమ్మవారి దర్శనాలకు భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు.