తిరుమలలో కొనసాగుతున్న రద్దీ
తిరుమల : మండుతున్న ఎండలు శ్రీవారి భక్తులపై ప్రభావం చూపలేకపోతున్నాయి. గత మూడు రోజులుగా రద్దీ పెరిగిపోయింది. శనివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 95 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం పత్యేక దర్శనానికి మూడు గంటలు, కాలినడక భక్తులకు 12 గంటలు, సర్వ దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. శనివారం రాత్రి గదులు దొరక్క.. దర్శనం కోసం వేచి చూస్తున్న భక్తులు ఆలయ వెలుపలే నిద్రించారు.