దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు


ఇంద్రకీలాద్రి (విజయవాడ) : ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనక దుర్గమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం ఉదయం నుంచే అమ్మవారి దర్శనానికి భక్తులు బారులుతీరారు. రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు మహామండపం సమీపంలోని ఘాట్‌రోడ్డు మీదుగా భక్తులను అనుమతించారు. ప్రస్తుతం అమ్మవారి సర్వదర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. ఆదివారం ఉదయం నుంచి సుమారు 60 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top