రానున్న 24 గంటల్లో కోస్తా, తెలంగాణలో భారీ వర్షాలు
విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరానికి సమీపంలో కేంద్రీకృతమైన అల్పపీడనం స్థిరంగా కదులుతుందని విశాఖలోని వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడన ద్రోణి ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కొనసాగుతుందని తెలిపింది. రానున్న 24 గంటల్లో కోస్తా, తెలంగాణ ప్రాంతాల్లో పలు చోట్ల భారీ వర్షాలు, మరికొన్నిచోట్ల మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది.