రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలో భారీ వర్షాలు


విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో.. ఉత్తరాంధ్రకు సమీపంలో ఏర్పడిన అల్పపీడనం బలంగా కేంద్రీకృతమైందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం శుక్రవారం తెలిపింది. ఆ అల్పపీడన ప్రాంతంలోనే ఉపరితల ఆవర్తనం అనుబంధంగా కొనసాగుతుందని వెల్లడించింది. దీంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర అంతటా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అంతేకాకుండా బలమైన ఈదురు గాలులు వీచే అవకాశాలు ఉన్నాయిని... ఈ నేపథ్యంలో సముద్రంలో చేపల వేటకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top