'హృదయ'పూర్వకంగా.. మంగళగిరి నుంచి చెన్నైకి

'హృదయ'పూర్వకంగా.. మంగళగిరి నుంచి చెన్నైకి - Sakshi


గుంటూరు : దేశం మొత్తం హోలీ సంబరాల్లో మునిగి తేలుతుంటే ఆ కుటుంబం మాత్రం విషాదంలో మునిగిపోయింది. అయినా ఆ కుటుంబం  పెద్ద మనసు చేసుకుంది. బ్రెయిన్ డెడ్ అయిన తమ ఆత్మీయుడి  అవయవాలను దానం చేయడానికి ముందుకొచ్చింది. రెండు రోజులు క్రితం  విజయవాడలో  జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు  డ్రైవర్ మణికంఠ తీవ్రంగా గాయపడ్డాడు.  



ఆ యువకుడి  బ్రెయిన్ డెడ్ అయినట్టుగా మంగళగిరిలోని ఎన్ఆర్ఐ ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. దీంతో అతని గుండె, లివర్, కాలేయం, కళ్లు, కిడ్నీలు దానం చేయడానికి కుటుంబ సభ్యులు అంగీకరించారు.  చెన్నై ఫోర్టిస్ ఆస్పత్రిలోని చికిత్స పొందుతున్న ఓ వ్యక్తికి ఆ యువకుడి గుండెను అమర్చనున్నారు. మంగళగిరిలోని ఎన్ఆర్ఐ ఆసుపత్రి నుంచి మధ్యాహ్నం రెండు గంటలకు ప్రత్యేక ఎయిర్ అంబులెన్స్‌లో చెన్నైకి తరలించేందుకు  ఏర్పాట్లు చేశారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top