ఇద్దరు అవినీతి అధికారుల అరెస్ట్


విశాఖపట్నం/గుంటూరు: లంచం తీసుకుంటూ ఇద్దరు అవినీతి అధికారులు దొరికారు. విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో ఆర్పీఎఫ్ సీఐ బిశ్వాస్  సీబీఐకి పట్టుబడ్డారు. అనకాపల్లి రైల్వేస్టేషన్ లో పార్కింగ్ నిర్వహణ కోసం లంచం డిమాండ్ చేయడంతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు.



గుంటూరు ఎక్సైజ్ సీఐ అశోక్బాబు ఓ వ్యాపారి నుంచి లక్ష రూపాయల లంచం తీసుకుంటూ తన కార్యాలయంలోనే అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కు చిక్కారు. కేసులు తొలగించేందుకు మద్యం వ్యాపారితో రూ. 2 లక్షలకు అశోక్బాబు ఒప్పందం కుదుర్చుకున్నాడు. తొలి విడతగా లక్షరూపాయలు తీసుకుంటూ ఏసీబీకి దొరికారు. అతడిపై గతంలో పలు అవినీతి కేసులున్నట్టు తెలుస్తోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top