మంత్రి దేవినేని ఇంట్లో మిస్ ఫైర్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇంట్లో గన్ మిస్ఫైర్ అయింది. నివాసంలో ఎస్కార్టుగా పనిచేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ శీను నాయక్ భుజానికి తగిలించుకున్న 303 రైఫిల్ ప్రమాదవశాత్తూ పేలింది.
దీంతో బుల్లెట్ ఇంటిపై కప్పును తాకింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.