నెల్లూరు జిల్లాలో కాల్పుల కలకలం


నెల్లూరు: తుపాకీ కాల్పుల ఘటనలతో తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేగింది. హైదరాబాద్ శివారులోని సరూర్ నగర్ లో జరిగిన కాల్పుల ఘటనపై విచారణ జరుగుతుండగానే మరోపక్క నెల్లూరు జిల్లాలో తుపాకీ పేలింది. తోటపల్లి గూడూరు మండలం దక్షిణ ఆమలూరులో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి.



కిరణ్ అనే వ్యక్తిపై రూప్ కుమార్ కాల్పులు జరిపాడు. భూతగాదాల నేపథ్యంలో ఇద్దరి మధ్య మాటామాట పెరగడంతో సహనం కోల్పోయిన రూప్ కుమార్ తనదగ్గరున్న తుపాకీతో కిరణ్ పై కాల్పులు జరిపాడు. నిందితుడు పరారీలో ఉన్నాడు. చికిత్స నిమిత్తం కిరణ్ ను ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top