వైఎస్సార్‌కు ఘన నివాళి

వైఎస్సార్‌కు ఘన నివాళి - Sakshi


వైఎస్ రాజశేఖరరెడ్డి ఐదో వర్ధంతిని పురస్కరించుకుని జిల్లాలో అన్నిచోట్లా అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. 14 నియోజకవర్గాల పరిధిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వైఎస్ విగ్రహాలకు పాలాభిషేకం, ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు, పాలు, రొట్టెల పంపిణీ చేశారు. పలుచోట్ల అన్నదాన, రక్తదాన కార్యక్రమాలు నిర్వహించారు. ‘వైఎస్సార్ అమర్ రహే!’ అంటూ నినదించారు. వైఎస్ ఆశయసాధన కోసం నిరంతరం పాటుపడతామని ప్రతినబూనారు.

 

సాక్షి, చిత్తూరు: తిరుపతి  తుడా సర్కిల్‌లో పార్టీ నగర అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన వర్ధంతి కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా కార్యకర్తలు, అభిమానులు రాజశేఖర రెడ్డి ఫోటో ఉన్న ప్లకార్డులను ప్రదర్శించి వైఎస్‌ఆర్ అమర్ ర హే అంటూ నినాదాలు చేశారు. అనంతరం అన్నదానం చేశారు. పుంగనూరు నియోజకవర్గం కల్లూరులో ఎంపీ మిథున్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

 

చిత్తూరులో వైఎస్సార్‌సీపీ కేంద్రపాలక మండలి సభ్యురాలు సీకే లావణ్య ఆధ్వర్యంలో 8మంది కార్పొరేటర్లు రెడ్డిపల్లి కూడలిలోని వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. పాతబస్టాండ్‌లో అన్నదానం చేశా రు. ప్రభుత్వాస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. మహిళావిభాగం జిల్లా కన్వీనర్ గాయత్రీదేవి ఆధ్వర్యంలో డీసీసీబీ, జెడ్పీ, అనుప్పల్లిలోని వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. శంకరయ్యగుంటలో అన్నదానం చేశారు. తపోవనంలోని బుద్ధిమాంద్యం పిల్లలకు న్యూట్రిన్ కార్మికుల ఆధ్వర్యంలో బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు.

     

* నగరిలో మున్సిపల్ చైర్‌పర్సన్ శాంతికుమార్ వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వృద్ధులు, వికలాంగులకు అన్నదానం చేశారు.

* చంద్రగిరిలో కొత్తపల్లి యూత్ ఆధ్వర్యంలో రక్తదానం నిర్వహించారు. తుమ్మలగుంటలో గోవిందరెడ్డి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు,

* తంబళ్లపల్లె నియోజకవర్గంలోని గట్టులో వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, ఆస్పత్రిలో పాలు, పండ్లు పంపిణీ చేశారు.

వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అన్నదానం చేశారు. పుంగనూరులో జెడ్పీటీసీ సభ్యుడు వెంకటరెడ్డి యాదవ్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు.

* పలమనేరులో వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు.

* పూతలపట్టులో జిల్లా అధికారప్రతినిధి బాబురెడ్డి, రాజారత్నం రెడ్డి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. పి. కొత్తకోట ఆస్పత్రిలో రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు.  బంగారుపాళెం మండలంలో కుమార్‌రాజా ఆధ్వర్యంలో వైఎస్ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

* పెనుమూరు మండలం గొడుగుమానిపల్ల్లె, ఎస్‌ఆర్ పురం మండలం కొత్తపల్ల్లె మిట్టలో వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం చేసి అన్నదానం చేశారు. పీలేరు ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు.

* కుప్పంలో వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. శెట్టిపల్లి బధిరుల పాఠశాలలో అన్నదానం చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top