వానరానికి ఘనంగా అంత్యక్రియలు
పశ్చిమగోదావరి: తీవ్రంగా గాయపడి మృతిచెందిన వానరానికి ఘనంగా అంత్యక్రియలు నిర్వహించిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.
యలమంచిలి మండలం అడవిపాలెం గ్రామంలో సంచరించే ఓ వానరం మూడు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో కాలుకు గాయమైంది. అప్పటి నుంచి తీవ్ర అస్వస్థతకు గురైన వానరం బుధవారం ఉదయం చనిపోయింది. దీంతో గ్రామస్తులంతా తీవ్ర విచారంతో అంతిమ యాత్ర జరిపిన అనంతరం ఖననం చేశారు. దశదిన కర్మ నిర్వహించి గ్రామంలో అన్నసంతర్పణ చేయాలని కూడా నిర్ణయించడం విశేషం.