ప్రధానితో నరసింహన్ భేటీ
న్యూఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పెండింగ్ సమస్యలపై నరసింహన్ చర్చించినట్టు సమాచారం. ఇరు రాష్ట్రాల్లోని తాజా పరిస్థితులను ప్రధానికి వివరించారు.
గవర్నర్ నిన్న (సోమవారం) రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో సమావేశమైన సంగతి తెలిసిందే. ఏపీ పునర్విభజన చట్ట ప్రకారం తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్లోని ఉన్న అంశాలను రాష్ట్రపతికి వివరించారు.