మైమ్ ద్వారా గుర్తింపు పొందాలని..మైమ్ కళాకారుడు మధు
మైమ్ కళ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను మెప్పించి మంచి కళాకారుడిగా గుర్తింపు పొందడమే లక్ష్యమని మైమ్ కళాకారుడు మధు అన్నారు. గోదారి నవ్వింది షూటింగ్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, దుబాయ్ దేశాల్లో మైమ్ ప్రదర్శనలు ఇచ్చానని చెప్పారు. జులైలో న్యూజిలాండ్, అమెరికాలో ప్రదర్శనలివ్వనున్నట్టు తెలిపారు. బర్డ్ అండ్ హంటర్, డ్రీం ప్రదర్శనలు మైమ్లో తనకెంతో గుర్తింపు నిచ్చాయన్నారు. జెమినీ టీవీలో ప్రసారమయ్యే శ్రావణ సమీరాలు సీరియల్లో విశాల్ పాత్ర మంచి గుర్తింపు తెచ్చి పెట్టిందన్నార