శిల్పాచార్యుడి ఇంట్లో భారీ చోరీ
అనంతపురం: జిల్లా పెద్దవడుగూరు మండల కేంద్రంలో సోమవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. శిల్పాలు రూపొందించే మహానంది ఆచార్య ఇంట్లో దొంగలు చొరబడి 35 తులాల బంగారు ఆభరణాలను కొట్టేశారు. ఆచార్య ఇంటికి తాళం వేసి పక్కనే ఉన్న కొత్త ఇంటి మిద్దెపై నిద్రిస్తుండగా.. అర్ధరాత్రి 2 గంటల సమయంలో దొంగలు పాత ఇంటి తలుపులను బలవంతంగా తెరిచి లోపలికి ప్రవేశించి వచ్చిన పని చక్కబెట్టుకుపోయారు.
ఆచార్య మంగళవారం ఉదయం నిద్రలేచిన తర్వాత జరిగిన విషయాన్ని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పామిడి సీఐ లక్ష్మణ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాగా, దొంగలు వదిలివెళ్లిన గడ్డపారను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
(పెద్దవడుగూరు)