ప్రేమించకుంటే చంపేస్తా...

ప్రేమించకుంటే చంపేస్తా... - Sakshi


అనంతపురం: అనంతపురం జిల్లా ధర్మవరంలో శుక్రవారం విషాదం చోటు చేసుకుంది. ప్రేమించకపోతే చంపేస్తానంటూ ఓ యువకుడు బాలికను తరచుగా వేధించడంతో తీవ్ర మస్తాపానికి గురైంది. దాంతో శుక్రవారం ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించింది. దాంతో కుటుంబసభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.


పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సదరు బాలిక రోజుకు స్కూలుకు వెళ్తున్న క్రమంలో యువకుడు వెంటపడుతూ వేధింపులకు పాల్పడే వాడని బాలిక తెలిపిందని... పోలీసులు వెల్లడించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top