లింగ నిర్ధారణ పరీక్షలు కారణంగానే..
కాకినాడ: లింగ నిర్ధారణ పరీక్షలు జరగబట్టే దేశంలో ఆడపిల్లల సంఖ్య తగ్గుముఖం పడుతుందని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రొఫెసర్ డా. రమాపద్మ ఆందోళన వ్యక్తం చేశారు. వైద్యసేవలకు చెందిన వ్యక్తుల సహకారంతోనే లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయన్నారు.
తూర్పు గోదావరి రాజమండ్రి రూరల్ ప్రాంతాల్లో బాలికల జనభా తక్కువగా ఉన్నట్లు సెన్సెక్స్ ద్వారా వెల్లడైనట్లు ఆమె తెలిపారు. కొందరు విద్యావంతులు కూడా ఆడ పిల్లలను వద్దనుకుని భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారని రమాపద్మ తెలిపారు.