గరుడ వాహనంపై శ్రీవారు.

గరుడ వాహనంపై శ్రీవారు


కడప కల్చరల్: దేవునికడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు శనివారం కడప రాయుడు విష్ణుమూర్తి అలంకారంలో తన ప్రియమైన గరుడ వాహనంపై ఆశీనులయ్యారు. ఉదయం స్వామి కల్పవృక్షంపై కొలువుదీరి దేవునికడప వాసులను కరుణించాడు. రాత్రి ఊంజల సేవ అనంతరం స్వామిని తిరుపతి నుంచి ప్రత్యేకంగా తెప్పించిన సువర్ణ గరుడ వాహనంపై పూలతో అలంకరించి కొలువుదీర్చారు.



స్వామికి తిరుచానూరు నుంచి తెచ్చిన కాసుల పేరును అలంకరించడంతో ఆ ఆభరణాల ధగధగలతో మెరిసిపోయాడు. చూసేందుకు రెండు కళ్లూ చాలవంటూ భక్తులు కనులవిందుగా స్వామిని దర్శించి మొక్కుకున్నారు. అనంతరం స్వామి గ్రామోత్సవానికి తరలి వెళ్లారు.

జనం రద్దీ: శనివారం కావడంతో స్వామి దర్శనానికి ఉదయం నుంచి భక్తులు బారులు తీరారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top