ఆరు శాతం అనర్హులను గుర్తించాం: గంటా

ఆరు శాతం అనర్హులను గుర్తించాం: గంటా - Sakshi


విశాఖపట్నం: తమ జిల్లాలో పెన్షన్ల సర్వే మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదివారం సమీక్ష నిర్వహించారు. 1350 కమిటీల నివేదిక ప్రకారం 6 శాతం అనర్హులను గుర్తించామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. 18,917 మంది ఫించన్ దారులపై అనర్హత వేటు వేశామన్నారు.



అక్టోబర్ 2 నుంచి సుజల స్రవంతి కార్యక్రమం ప్రారంభించనున్నట్టు చెప్పారు. అరకు, పాడేరు మినహా 13 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం ప్రారంభిస్తామని తెలిపారు. ఏజెన్సీలో ఆధార్ లేకుండా కొంతకాలం నమోదు కార్యక్రమం కొనసాగిస్తామని వెల్లడించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top