8 మంది గంజాయి స్మగ్లర్ల అరెస్ట్
జగ్గంపేట: అక్రమంగా గంజాయిని తరలిస్తున్న 8 మంది స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం మధుశాల శివారులో గంజాయిని కారులోకి లోడు చేస్తున్న 8 మంది సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 10 కిలోల గంజాయి, 64 కిలోల తుమ్మపొట్టు కలిపిన నకిలీ గంజాయి, రూ. 90 వేల నగదుతో పాటు ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసిన వారిలో వరంగల్ జిల్లాకు చెందిన ఆరుగురు సభ్యులతో పాటు మధుశాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు.