వెయ్యి కిలోల గంజాయి స్వాధీనం
చింట్యాడ: విజయనగరం జిల్లాలో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. చింట్యాడ మండల కేంద్రంలో శనివారం ఉదయం వెయ్యి కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారంతో కాపు కాసిన పోలీసులు పలువురిని అరెస్టుచేసి వారి వద్ద నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన వారి వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచారు.
సంబంధిత వార్తలు