ఫోటోలతో బెదిరించి యువతిపై గ్యాంగ్ రేప్

ఫోటోలతో బెదిరించి యువతిపై గ్యాంగ్ రేప్


విజయనగరం: యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన విజయనగరం జిల్లా గజపతినగరం మండలం కురిటిపెంటలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఇంటర్మీయట్ చదువుతున్న విద్యార్థినిపై అదే గ్రామానికి చెందిన ఐదుగురు యువకులు లైంగిక దాడి చేశారు.  సెల్ఫోన్ తో ఫోటోలు తీసి ఆమెను బెదిరించి ఈ దారుణానికి పాల్పడ్డారు.



ఈ విషయాన్ని ఎవరితో చెప్పుకోలేక బాధితురాలు ఇంటి నుంచి పారిపోయింది. ఆమెను వెతికి పట్టుకోవడంతో అసలు విషయం వెలుగుచూసింది. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top