నేటి నుంచి నగదు రహిత వైద్యం: కామినేని
సాక్షి, హైదరాబాద్: ఏపీ సూపర్స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం(ఆశా)తో జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు తెలిపారు. ఫలితంగా ఉద్యోగులకు ఆదివారం నుంచి నగదు రహిత వైద్యం అమలవుతుందని చెప్పారు. శనివారం సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు సమక్షంలో ఈ చర్చలు జరిగాయన్నారు.