బ్యాంకు ఖాతాకు సిమ్ కార్డు ఫ్రీ


ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభించిన జనధన యోజన పేదలకు పలురకాలుగా ఉపయోగపడుతోంది. తాజాగా బీఎస్ఎన్ఎల్ సంస్థ కూడా ఈ పథకానికి తమవంతు సాయం అందించడం మొదలుపెట్టింది. ప్రజలకు ఇదో డబుల్ ధమాకా. జనధన యోజన కింద బ్యాంకు ఖాతా తీసుకున్న ప్రతి ఒక్కరికీ ఉచితంగా సిమ్ కార్డులు రాబోతున్నాయి.



పశ్చిమగోదావరి జిల్లాలో బీఎస్‌ఎన్‌ఎల్ ఈ పథకాన్ని ప్రవేశపెడుతోంది. ఈ విషయాన్ని ఆ సంస్థ జీఎం అనంతరామ్ తెలిపారు. డిసెంబర్ 10 వరకు ఈ అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఈ పథకం కింద బ్యాంకు ఖాతా తెరిస్తే ఉచితంగా జీవితబీమా సదుపాయం కూడా లభిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సిమ్ కార్డు సదుపాయం అదనం అన్నమాట.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top