స్కూల్కు వెళ్లిన విద్యార్థినిలు అదృశ్యం


ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయిగూడెంలోని స్థానిక ఉన్నత పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థినులు మంగళవారం అదృశ్యమైయ్యారు. దాంతో ఆ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ... పోలీసులను ఆశ్రయించారు. నిన్న ఉదయం స్కూల్కు వెళ్లిన విద్యార్థులు సాయంత్రానికి ఇంటికి చేరలేదని ఆ విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులోభాగంగా పోలీసులు విచారణ చేపట్టారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top