నేడు తుళ్లూరులో వీఐటీ శంకుస్థాపన
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో అంతర్జాతయ స్థాయి యూనివర్శిటీ వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(వీఐటీ)కు నేడు శంకుస్థాపన జరగనుంది.
తుళ్లూరు మండలం ఐనవోలు గ్రామంలో నెలకొల్పే ఈ యూనివర్శిటీకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి వీఐటీ బృందంతో పాటు ఏపీ మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొంటారు. రాజధాని ప్రాంతంలో నిర్మించే తొలి అంతర్జాతీయ యూనివర్శిటీగా వీఐటీ ప్రత్యేకతను సంతరించుకుంది.