సాగునీటి కోసం రైతుల ధర్నా
గుంటూరు : గుంటూరు జిల్లా నకరికల్లు అడ్డరోడ్డు వద్ద సాగునీటి కోసం గురువారం రైతులు ధర్నా నిర్వహించారు. రబీవరి, మెట్టపంటలకోసం మరో 20 రోజులు సాగర్ కుడికాలువ నుంచి నీటిని విడుదల చేయాలని ఆందోళన చేపట్టారు. రైతులు నిర్వహించిన ఈ ధర్నాకు వైఎస్సాసీపీ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ముస్తఫా షేక్లతో పాటు పలువురు జిల్లా నాయకులు మద్ధతు తెలిపారు.
(నకరికల్లు)