మాజీ ఎమ్మెల్యే జొన్నా సూర్యనారాయణ మృతి
హైదరాబాద్: అనంతపురం జిల్లా కదిరి మాజీ ఎమ్మెల్యే జొన్నా సూర్యనారాయణ మరణించారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడేవారు. జొన్నా మృతికి వైఎస్ఆర్ సీపీ నేతలు విజయసాయి రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సంతాపం ప్రకటించారు.
ఎమ్మెల్యేలు వై విశ్వేశ్వర్ రెడ్డి, చాంద్బాషా, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి, శంకర్ నారాయణ తదితరులు సంతాపం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి జొన్నా సూర్యనారాయణ కుటంబాన్ని పరామర్శించారు.