పొంగుతున్న వాగులు
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. రాజుపాలెం మండలం వెంగళాయపాలెం సమీపంలోని మాడువంక ఉధృతంగా ప్రవహిస్తుండటంతో.. ప్రాద్దుటూరు చాగలమర్రిమధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
మరో వైపు జమ్మలమడుగు చెరువులు కట్టలు తెంచుకున్నాయి. మండల పరిధిలోని పెద్ద పసుపుల గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామానికి నాలుగు వైపులా నీళ్లు రావడంతో గ్రామస్థులు జలదిగ్బంధంలో ఉన్నారు. గ్రామంలోని పాఠశాలతో పాటు ఎస్సీ హాస్టల్లోకి నీళ్లు వచ్చి చేరాయి.