నాకు నీవు.. నీకు నేను.. ఒకరికొకరం

నాకు నీవు.. నీకు నేను.. ఒకరికొకరం

హిందూపురం : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు కొరతతో విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటే... హిందూపురంలో వింత పరిస్థితి నెలకొంది. స్థానిక కంసలపేటలో ఉన్న వివేకానంద మున్సిపల్‌ ప్రాథమిక పాఠశాలలో ఐదుగురు విద్యార్థులకు ఐదుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. 

 

ఈ ఏడాది 1వ తరగతిలో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. 2వ తరగతిలో ఒకరు, 3లో ఇద్దరు, 4లో ఒకరు, 5లో ఒకరు ఉన్నారు. గత విద్యాసంవత్సరంలో ఈ పాఠశాలలో 21 మంది విద్యార్థులు ఉండగా..ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య ఐదుకు చేరింది. గతంలో ఇద్దరు మాత్రమే ఉపాధ్యాయులు పాఠ్యాంశాలు బోధించారు. ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య తగ్గింది... ఉపాధ్యాయుల సంఖ్య పెరిగింది. దీనిపై అధికారులు దృష్టి సారించకపోవడం గమనార్హం. 
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top